కైరాకి శుభాకాంక్షలు చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

  • June 20, 2018 / 06:48 AM IST

టాలీవుడ్ లో వరుస విజయాలతో టాప్ హీరోయిన్ జాబితాలో స్థానం దక్కించుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు తమిళ సినిమాల్తో బిజీగా ఉంది. ఇక భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ భామ కైరా అద్వానీ. వీరిద్దరికి ఓ బంధం ఉంది. అదేమిటంటే మహేష్ తో స్పైడర్ మూవీ చేసి ఉన్న అవకాశాలను రకుల్ పోగొట్టుకుంది. కైరా అదే మహేష్ తో నటించి ఎన్నో అవకాశాలు అందుకుంది. ఒక విధంగా రకుల్ అవకాశాలను కైరా కొట్టేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. తనకు పోటీగా వస్తున్న కైరాపై రకుల్ నిప్పులు చెరగకుండా శుభాకాంక్షలు చెబుతోంది. ఎందుకో వివరాల్లోకి వెళితే… కరణ్‌ జోహార్‌, అనురాగ్‌ కశ్యప్, దివాకర్‌ బెనర్జీ, జోయా అక్తర్‌ కలిసి ఓ వెబ్ సిరీస్ ని డైరక్ట్ చేశారు.

రోనీ స్క్రూ‌వాలా నిర్మించిన ఈ సిరీస్ లో కైరాతోపాటు రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్‌, మనీషా కొయిరాలా, నేహా ధుపియా ప్రధాన పాత్రలు పోషించారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ జూన్‌15న విడుదలై మంచి స్పందన అందుకుంది. దీనిని చూసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా యూనిట్‌ సభ్యులను ప్రశంసించింది. “ఈ కథల ప్రపంచంలో మెరుగైన ఆలోచన, ముందు చూపుతో తెరకెక్కించిన చిత్రం ‘లస్ట్‌ స్టోరీస్’. మనుషుల ఆశలు, ఆంక్షలను బలంగా చూపించారు. సినిమాలోని ప్రతి నటీనటులు తమ పాత్రల్లో జీవించారు. కైరా, కరణ్‌ తదితరులకు శుభాకాంక్షలు” అని చెప్పింది. ఈ ట్వీట్ కి కైరా ‘ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చింది. స్టార్ హీరోల మధ్య మాత్రమే కాదు.. స్టార్ హీరోయిన్స్ కూడా కలిసిమెలిసి సినిమాలు చేస్తున్నట్టు ఈ సంఘటన స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus