బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేస్తున్న మూవీ ఒక మినీ మల్టీస్టారర్

  • April 6, 2018 / 07:17 AM IST

రంగస్థలం విజయంతో చరణ్ ఫుల్ ఫామ్లోకి వచ్చారు. తనకి మగధీర వంటి హిట్ ఇచ్చిన రాజమౌళితోను ఓ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల మధ్యలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీ చేయబోతున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే ఇది కూడా ఓ మినీ మల్టీ స్టారర్ మూవీ అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజ వంశస్థుడిగా రామ్ చరణ్ నటించనున్న ఇందులో అన్నయ్యలుగా తమిళ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ హీరో), నవీన్‌ చంద్ర(అందాల రాక్షసి), ఆర్యన్ రాజేష్ (సొంతం) నటించనున్నారు. ఈ ముగ్గురు హీరోలుగా నటించినవారే. హిట్స్ కూడా అందుకున్నారు.

ఇక విలన్ గా చేస్తున్న వివేక్ ఓబరాయ్ కూడా హీరో పాత్రల్లో మెప్పించారు. సో రామ్ చరణ్ తో పాటు నలుగురు హీరోలు నటిస్తున్న దీనిని మినీ మల్టీ స్టారర్ మూవీగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక చెర్రీ కి వదినలుగా అలనాటి హీరోయిన్ స్నేహ, అనన్య (‘జర్నీ’ ఫేం), హిమజలు కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెండో షెడ్యూల్ మొదలుకానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus