సంక్రాంతి పోటీ గురించి అస్సలు భయం లేదు : రాంచరణ్

  • January 7, 2019 / 02:01 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న తరుణంలో.. ఈ చిత్ర ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు చరణ్. మరో వైపు ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ ‘ఎఫ్2’ ‘పేట’ వంటి చిత్రాలు కూడా రిలీజ్ కాబోతుండడంతో భారీ పోటీ నెలకొంది.

ఇక ఈ విషయం చరణ్ స్పందిస్తూ… “రెండు భారీ చిత్రాలను సంక్రాంతి సీజన్ ఈజీగా అకామడేట్ చేస్తుంది. మరో వారం రోజుల తర్వాత మరో భారీ చిత్రాన్ని కూడా విడుదల చేయొచ్చు. సంక్రాంతి అంత సత్తా ఉంది. ఈ సంక్రాంతి పోటీ గురించి నేను కంగారు పడటం లేదు … అన్ని సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం నాకుంది”.

ఇక బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం గురించి చరణ్ మాట్లాడుతూ… “నేను పర్సనల్ గా కూడా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నా, అలాగే ఎంతో మర్యాదతో ఎదురుచూస్తున్నా… ‘ఎన్టీఆర్’ పై ఎంతో గౌరవంతో ఆ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించాడని నేను భావిస్తున్నాను.., ప్రతి ఒక్కరూ గర్వించేలా ఈ చిత్రం కచ్చితంగా ఉంటుంది. నేను చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘ఎప్2’ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని చరణ్ చెప్పాడు. చరణ్ స్పందిస్తూ “చాలా కాలం తరువాత వెంకీగారు.. కామెడీ యాంగిల్ తో వస్తున్నారు.. కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు… ఇక అయన పక్కన వరుణ్ ఎలా చేశాడో కూడా చూడాలి” అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus