అఖిల్ కు బెస్ట్ విషెస్ చెప్పిన చరణ్..!

  • January 22, 2019 / 01:12 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని అఖిల్ ల మధ్య మంచి స్నేహబందం ఉందన్న సంగతి తెలిసిందే. రాంచరణ్ ప్రతీ సినిమా సెట్లోనూ అఖిల్ దర్శనమిస్తూనే ఉంటాడు. అంతేకాదు చరణ్ పెద్దన్నయ్య అంటూ పిలుస్తుంటాడు. అంతే కాదు చరణ్ – అఖిల్ మధ్య బంధం గురించి ‘హలో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చెప్పకనే చెప్పారు. ఇక అఖిల్ ప్రతి సినిమాకు చరణ్ తన విషెస్ చెబుతుంటాడు. ప్రస్తుతం అఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రం జనవరి 25న విడుదల కాబోతుంది.

అఖిల్ నటించిన గత రెండు చిత్రాలు మంచి విజయాల్ని నమోదు చేయలేక విఫలమయ్యాయి. ఇక ఈ చిత్రంతో అఖిల్ కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ లాంటి సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇటీవల విడుదల చేసిన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ట్రైలర్ చూసిన రాంచరణ్ తన ఫేస్బుక్ పేజీ ద్వారా స్పందించాడు. ట్రైలర్ చాలా బాగుందని, అఖిల్, నిధి అగర్వాల్, వెంకీ అట్లూరి, బీవీఎస్ఎన్ ప్రసాద్ అలానే చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు అంటూ తన విషెస్ చెప్పాడు. మరి ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus