అస్సాం వరద బాధితులకు ఆర్ధిక సాయం అందించిన అమీర్ ఖాన్, రామ్ చరణ్

  • August 2, 2017 / 12:22 PM IST

జూన్ మొదలుకొని జూలై రెండవ వారం వరకు అస్సాం వరద తాకిడికి గురై అల్లల్లాడింది. వేల ఎకరాల పంట నష్టం జరిగింది. 65 మందికిపైగా చనిపోయారు. అనేకమంది నిరాశ్రయులు అయ్యారు. కజిరంగా జాతీయ పార్కు తొంభై శాతం జలమయయంకావడంతో అనేక ప్రాణులు మృత్యువాతపడ్డాయి. ఈ నష్టానికి చలించిన రామ్ చరణ్ దంపతులు ఆర్ధిక సాయం చేశారు. వరద బాధితులకు రామ్ చరణ్ 1.56  కోట్లు, ఉపాసన 1.12 కోట్లు అందించారు. అంతేకాదు ” మీరు ఇచ్చే ప్రతి రూపాయి అస్సాం ని తన కాళ్ల మీద నిలబడేలా చేస్తుంది.” అని రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.

దీనికి అనేకమంది స్పందించి విరాళం అందించారు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అస్సాం లో సర్వము కోల్పోయిన వారికి అవసరాల నిమిత్తం 25 లక్షలను సాయం చేశారు. వీరి స్పూర్తితో మరికొంతమంది టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ సాయం అందించడానికి సిద్ధమవుతున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus