మూడేళ్ల బాలుడి ప్రాణం కాపాడిన రామ్ చరణ్

  • June 20, 2017 / 01:20 PM IST

నటన, డ్యాన్స్ లోనే కాదు సేవలోను రామ్ చరణ్ తేజ్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి ఎంతోమంది ప్రాణాలను రక్షించారు. తండ్రి నడిచిన బాటలోనే రామ్ చరణ్ నడుస్తున్నారు. ధనుష్‌ అనే మూడేళ్ల బాలుడి ప్రాణం కాపాడారు. ఎవరా బాలుడు ?, అతని ప్రాణం ఎలా కాపాడంటే కొన్ని రోజుల వెనక్కి వెళ్ళాలి… సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’ షూటింగ్ తొలి షెడ్యూల్ ఏప్రిల్‌లో రాజమహేంద్రవరం పరిసరాల్లో జరిగింది. ఆ సమయంలో అక్కడి గ్రామానికి చెందిన ధనుష్‌ కుటుంబం రామ్‌చరణ్‌ను కలిసింది. ధనుష్‌ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడని అతడి తల్లిదండ్రులు చరణ్‌ కి చెప్పుకున్నారు.

దీంతో స్పందించిన చెర్రీ చికిత్సకు ఏర్పాట్లు చేయమని తన బృందానికి సూచించారు. వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ధనుష్‌కు చికిత్స జరిగింది. దీనికి అయ్యే ఖర్చునంతా చరణ్‌ భరించారు. ఇప్పుడు ధనుష్‌ ఆరోగ్యంగా ఉన్నాడని తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం ‘రంగస్థలం’ షూటింగ్‌ మళ్లీ రాజమహేంద్రవరం పరిసరాల్లోనే జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడికి ధనుష్‌, కుటుంబ సభ్యులు వెళ్లారు. చరణ్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పారు. ధనుష్‌ ఆరోగ్యంగా ఉండటం తనకి సంతోషాన్ని కలిగించిందని చరణ్‌ చెప్పారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus