రామ్ చరణ్ సరసన మరోసారి నటించనున్న సమంత

  • March 1, 2018 / 06:36 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సమంత తొలిసారి రంగస్థలంలో నటించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 30 న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో మారు కలిసి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలం తర్వాత చెర్రీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. దాని తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. బాహుబలి తర్వాత జక్కన్న ఎన్టీఆర్, చరణ్ లతో మల్టీ స్టారర్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నాని సెలక్ట్ చేశారు.

ఇక చరణ్ సరసన ఎవరైతే బాగుంటుందని పరిశీలిస్తుండగా చాలామంది సమంత పేరే చెప్పారంట. కారణం ఏమిటంటే రంగస్థలంలో వీరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని తెలుసుకొని సమంతని సూచించారంట. దీంతో రాజమౌళి కూడా సమంతనే తీసుకోవాలని చూస్తున్నారు. గతంలో సమంత ఈగ సినిమాలో నటించింది. అప్పుడు సమంత డెడికేషన్ ని రాజమౌళి పరిశీలించారు. సో ఆమె హీరోయిన్ గా ఖరారు కానుంది. ఈ విషయాన్నీ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus