చరణ్ జిమ్మిక్కులు బాలయ్య అభిమానులకు తెలియవా ?

  • January 4, 2017 / 10:57 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి చిరంజీవి నుంచి నటనలో పాఠాలు నేర్చుకున్నాడో లేదో తెలియదు కానీ, మేనమామ అల్లు అరవింద్ నుంచి బిజినెస్ ట్రిక్కులు బాగానే ఒంటపట్టించుకున్నాడని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మామ కంటే బాగా మాట్లాడుతున్నాడని అభినందిస్తున్నారు. ఇంతకీ ఏమి చేసాడనే కదా.. మీ అనుమానం. అందులోకే వెళ్దాము. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో తాను నిర్మించిన మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150 రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ చరణ్ ఇచ్చిన కలరింగ్ ఓ రేంజ్ లో ఉందని టాలీవుడ్ వర్గాలు విమర్శిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ చిత్రం కోసమే తమ చిత్రాన్ని జనవరి 11 న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.

బాలయ్య వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి విడుదలయ్యే రోజు ఖైదీ నంబర్ 150 రిలీజ్ వద్దని తన తండ్రి చిరంజీవి చెప్పడంతో ఒకరోజు ముందుగా రిలీజ్ చేస్తున్నామని చరణ్ వివరించారు. బాలయ్యకు అంతగా మేలు చేసేవారైతే రెండు రోజులు తర్వాత  రిలీజ్ చేసుకోవాలి గాని ముందు రిలీజ్ చేయటమేంటని సినీ పండితులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే  ఏ చిత్రం ముందు రిలీజ్ అయితే దానికి ఫస్ట్ డే కలక్షన్ భారీగా ఉంటుంది. దాని తర్వాత వచ్చే చిత్రంపై ఆ ప్రభావం ఉంటుంది. అందుకే తెలివిగా చిరు సినిమాను బాలయ్య చిత్రం కంటే ముందుగా తీసుకొస్తూ.. అది బాలయ్య కోసమేనంటూ నందమూరి అభిమానులకు చరణ్ క్రీమ్ బిస్కెట్ వేశారని చెబుతున్నారు. చరణ్ జిమ్మిక్కులు బాలయ్య అభిమానులకు తెలియవా? అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus