మహేష్, జూ.ఎన్టీఆర్ లతో స్నేహం పై చరణ్ కామెంట్..!

  • January 11, 2019 / 11:39 AM IST

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ‘వినయ విధేయ రామా’ చిత్రంతో ఈ సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అయ్యాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 11న (ఈరోజు) విడుదలకాబోతుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత డీ.వి.వి.దానయ్య నిర్మించారు.ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించాడు. ‘భరత్ అనే నేను’ ఫేం కైరా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. కోలీవుడ్ నటుడు ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్, హిమజ ముఖ్య పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మంచి స్పందన లభించింది.

ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా చరణ్ ఆసక్తి కరమైన విషయాల్ని తెలుపుతున్నాడు. మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ లతో తన స్నేహ బంధం గురించి రాంచరణ్ మాట్లాడుతూ.. “మహేష్,ఎన్టీఆర్ లు నాకు చాలా మంచి మిత్రులు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో నా స్నేహం ఎప్పటినుండో ఉంది. మహేష్ తో ఈ మధ్య ఎక్కువ స్నేహంగా ఉంటున్నాను. సోషల్ మీడియా వచ్చిన తరువాత ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాం కానీ.. తారక్,నేను ఎప్పటినుండో కలిసే ఉన్నాం. నాన్న గారు కూడా ఎప్పుడూ ఇలాగే కలిసుంటారు. ఆయన్నే నేను ఫాలో అవుతున్నాను. అన్ని పార్టీలకు అందరి హీరోలతోనూ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను.” అంటూ చెప్పుకొచ్చాడు రాంచరణ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus