వివాదంలో ఇరుక్కున్న రానా

  • October 22, 2016 / 07:39 AM IST

ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మనవడు రానా వివాదంలో ఇరుక్కున్నారు. బాహుబలి లో భళ్లాలదేవుడిగా నటనా ప్రతిభను ప్రదర్శించిన ఈ హీరో పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు పి.ఇళగోవన్. కోయంబత్తూరుకు చెందిన ఈయన సోషల్ యాక్టవిస్ట్.

“రానా, ప్రకాష్ రాజ్ లు రమ్మీ ఆడమని ప్రోత్సహిస్తున్నారు. వెబ్ సైట్ల ద్వారా గ్యాంబ్లింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు. వారు నటించిన ప్రకటన టీవీల్లో కూడా ప్రదర్శితమవుతున్నాయి. దీని వల్ల మరిన్ని వెబ్ సైట్స్ పేకాటను విస్తరిస్తాయి” అని ఆయన పోలీస్ కమిషనర్ కి వివరించారు. దీంతో కోయంబత్తూరు పోలీసులు ఈ విషయం పై విచారణ మొదలెట్టారు. సరదాగా చేసిన ప్రకటన వివాదంలోకి లాగుతుందని రానా ఊహించి ఉండరు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నటిస్తూ బిజీగా ఉన్న రానా ఈ వివాదం నుంచి ఎలా బయట పడతారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus