రానా, ఎన్టీఆర్, మహేష్ మధ్య నెలకొన్న పోటీ!

  • May 26, 2017 / 01:39 PM IST

మహేష్, ఎన్టీఆర్, రానా.. నటులుగా నిరూపించుకున్న స్టార్స్. వీరి ముగ్గురి అభిరుచులు, అభిమానులు వేరు. పూర్తిగా వీళ్ల దారులే వేరు. అటువంటిది తొలిసారి పోటీ పడనున్నారు. ఎలాగో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళదాం… బాహుబలి తర్వాత రానా తేజ దర్శకత్వంలో నేనే మంత్రి నేనే రాజు అనే మూవీ చేస్తున్నారు. లీడర్ సినిమా తర్వాత మళ్ళీ పొలిటికల్ డ్రామా తో మనముందుకు రాబోతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ మూవీ చేస్తూనే.. కొరటాల శివ ప్రాజక్ట్ ని పట్టాలెక్కించారు.

భరత్ అను నేను అనే ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. తనదైన స్టైల్లో రాజకీయనాయకులపై సెటైర్స్ వేయనున్నారు. ఇక ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. అది పొలిటికల్ థ్రిల్లర్ అని సమాచారం. ఇలా రానా, మహేష్, ఎన్టీఆర్ ఒకే జాన్రా లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి ముగ్గురులో విజయం ఎవరికీ వరిస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus