శర్వా, శేష్ లలో గెలిచేదెవరో…?

  • August 7, 2019 / 12:38 PM IST

ఆగష్టులో అసలైన సినిమా సందడి మొదలు కాబోతుంది. ఇప్పటికే ఆగష్టు 2 న విడుదలయిన ‘రాక్షసుడు’ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన ‘గుణ 369’ చిత్రం కూడా పర్వాలేదనిపించింది. ఈ రెండు చిత్రాలు ఆగష్టు నెలకి శుభారంభం పలికాయని చెప్పొచ్చు. ఇక ఆగష్టు 9 న ‘కింగ్’ నాగార్జున ‘మన్మధుడు2’ వస్తుంది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాదిస్తుందని అంచనా వేస్తున్నారు ఫిలిం విశ్లేషకులు. ఇదిలా ఉండగా.. (స్వాతంత్ర్య దినోత్సవం రోజున) ఆగష్టు 15 న రెండు క్రేజీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. విషయం ఏమిటంటే ఇవి రెండూ కూడా యాక్షన్ ఎంటర్టైనెర్లే కావడం విశేషం.

ఇంతకీ ఆ చిత్రాలేమిటంటే.. ఒకటి శర్వానంద్ హీరోగా వస్తున్న ‘రణరంగం’ కాగా మరొకటి అడివి శేష్ హీరోగా వస్తున్న ‘ఎవరు’ చిత్రం. అయితే రెండు యాక్షన్ చిత్రాలే అయినప్పటికీ… శర్వానంద్ ‘రణరంగం’ చిత్రం మాఫియా డ్రామా కాగా.. శేష్ ‘ఎవరు’ సస్పెన్స్ థ్రిల్లర్ కావడం విశేషం. ‘రణరంగం’ లో హీరోయిన్ల గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. కళ్యాణి ప్రియదర్శన్ అలాగే కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్లు కాగా. ఇక శేష్ ‘ఎవరు’ లో రెజీనా హీరోయిన్. అంటే ‘ఎవరు’ లో హీరోయిన్ అట్రాక్షన్ మైనస్ అని చెప్పొచ్చు. విడుదలైన ఈ రెండు చిత్రాల ట్రైలర్లు కూడా ఆకట్టుకున్నాయి. అంతేకాదు రెండిటికి మంచి క్రేజ్ కూడా ఉంది. మరి 15 న విడుదల కాబోయే ఈ చిత్రాల్లో ఏ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus