రంగస్థలం రీ షూట్ పై స్పందించిన చిత్ర బృందం

  • December 12, 2017 / 05:52 AM IST

ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం ” చేస్తున్నారు. గ్రామీణ యువకుడిగా చెర్రీ లుక్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇది విశేషంగా ఆకట్టుకుంది. అలాగే కొన్ని స్టిల్స్ బయటికి వచ్చాయి. పాతిక సంవత్సరాల క్రితం పల్లెటూళ్లలో ఎలా ఉంటారో.. అలాంటి వాతావరణం ఫొటోలో కనిపించింది. అలాగే రామ్ చరణ్, సమంత కూడా పాత్రలకు తగ్గ వస్త్రధారణలో మెప్పించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా రెండు షెడ్యూళ్లు రాజమండ్రి, రాజమహేంద్రవరం పరిసరాల్లో జరిగింది. మూడో షెడ్యూల్ హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన భారీ గ్రామీణ సెట్ లో పూర్తిచేసుకుంది. ఇక రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.

ఈ రెండు పాటలు కూడా గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించాలి. గోదావరి జిల్లాల్లో ఈ పాటలను తెరకెక్కించాలని సుకుమార్ డిసైడ్ అయ్యారు. అయితే ఈ మూవీ గురించి ఫిలిం నగర్లో ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. టాకీ పార్ట్ కంప్లీట్ కావడంతో రష్ ని చిరంజీవి చూసారని, కొన్ని సీన్లు అతనికి నచ్చలేదని.. రీ షూట్ చేయమని చెప్పినట్లు .. సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్ర బృందం స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. చిరంజీవి సైరానరసింహ రెడ్డి పనుల్లో బిజీగా ఉన్నారని తెలిపింది. తాము మిగిలి ఉన్న పాటల చిత్రీకరణకు త్వరలో పల్లెటూరు కి వెళ్తామని వెల్లడించింది. జగపతి బాబు, అది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus