మెగా హీరోకు షాక్!!!

  • May 7, 2016 / 08:49 AM IST

టాలీవుడ్ యువ హీరోల్లో జెడ్ స్పీడ్ తో దూసుకుపోతున్న వారిలో మెగా శిబిరం నుంచి వచ్చిన సాయిధర్మతేజ ఒకడు. అయితే ఈ యువ హీరో ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో ఒక్క రేయ్ మినహా మిగిలిన సినిమాలు పర్వాలేదు అనిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా అనిల్ రావి పొద్ది దర్శకత్వంలో రాశిఖన్నా తో ఈ హీరో చేసిన సినిమా ‘సుప్రీమ్’. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచి మంచి వసూళ్లను సాధిస్తుంది. ఇదే క్రమంలో ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన ఒకటి సాక్షాత్తూ హీరోగానే బయట పెట్టారు. ఇంతకీ ఎంతా సంఘటన అంటే…ఈ సినిమాలో చిరంజీవి నాటి హిట్ సాంగ్ ‘‘అందం హిందోళం.. అధరం తాంబూలం’’ పాటను రీమిక్స్ చేసి వాడుకున్నారు.

అయితే ఆ పాత ఫ్లేవర్ ఎక్కడా పోకుండా జాగ్రత్తగా డ్యాన్స్ డిసైన్ చేశారు డ్యాన్స్ మాస్టర్. ఇక ఈ పాట తొలి రోజు షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత, మరుసటి రోజున మొదటిరోజు స్టెప్పుల వేసిన తీరుతో వచ్చిన కాన్ఫిడెన్స్ తో సెట్ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ అదే తరహాలో టెన్షన్ పడుతున్న రాశి ఖన్నా వద్దకు వెళ్ళి..నువ్వేం భయపడకు…నిన్న మనం బాగా డ్యాన్స్ చేశాం. ఈ రోజు బాగానే చేస్తాం.. టెన్షన్ పడొద్దని ఉత్సాహపరిచేలా నాలుగు మాటలు చెప్పాడట. అతడి మాటలన్నీ విన్న రాశీఖన్నా.. స్టెప్పులు బాగా వేసిన విషయం తనకు తెలుసని కూల్ గా చెప్పేసిందట. ఇక ఈ రెస్పాన్స్ విన్న సాయి పాపం ఆమె మాటలకు అవాక్కు అయ్యాడట. పాపం సాయి…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus