జై లవకుశ కథలో మార్పులు సూచించిన రవితేజ!

  • September 15, 2017 / 10:41 AM IST

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ వచ్చే వారం రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ బిజీగా ఉన్న ఈ సమయంలో ఈ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ చక్కర్లు బయటికి వచ్చింది. ఈ స్టోరీ రవితేజను దృష్టిలో పెట్టుకొని రాసిందంట. వివరాల్లోకి వెళితే.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫెయిల్ తో బాధపడ్డ బాబీ.. మూడు నెలలు కూర్చొని జై లవకుశ కథ రాసుకున్నారు. ఆ కథని మొదట రవితేజకి వినిపించినట్లు తెలిసింది. కథ విన్న రవితేజ కొన్ని మార్పులు సూచించారట. మూడు పాత్రలకు బదులు, రెండు పాత్రలు చేయమని చెప్పారని సమాచారం.

కథలో మార్పు చేయడం ఇష్టం లేని బాబీ అదే కథను ఎన్టీఆర్ కి వినిపించారట. కొత్త కథ కోసం గాలిస్తున్న సమయంలో ఈ స్టోరీ బాగా నచ్చి ఒకే అన్నారని ఫిలిం నగర్ వర్గాల వారు చెబుతున్నారు.  ఆ కథ కోసం ఎన్టీఆర్ గట్టిగా శ్రమించి.. టీజర్, ట్రైలర్ లతో అంచనాలను పెంచుతున్నారు. మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలుసుకోవాంటే సెప్టెంబర్ 21 వరకు ఆగాల్సిందే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus