రవితేజ ‘మహాసముద్రం’ లో హీరోయిన్ ఫిక్స్?

  • July 15, 2019 / 03:40 PM IST

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. విఐ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చిందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు రవితేజ. ఇక ఈ చిత్రం తర్వాత రవితేజ ‘ఆర్ఎక్స్ 100’ వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన అజయ్ భూపతి డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘మహాసముద్రం’ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి.

అజయ్ భూపతి వినిపించిన కథ నచ్చడంతో రవితేజను వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని టాక్ నడుస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అదితిరావ్ హైదరిని ఎంచుకోవాలని ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారట. బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన అదితి ’సమ్మోహనం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. మరి రవితేజ చిత్రానికి ఆమె ఓకే చెబుతుందో లేదో చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus