వి.ఐ.ఆనంద్ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు

  • September 29, 2018 / 12:40 PM IST

సాధారణంగా సెంటిమెంట్లు పెద్దగా పట్టని రవితేజకీ ఉన్నట్లుండి న్యూమరాలజీ మీద నమ్మకం పెరిగినట్లుంది. సడన్ గా నెంబర్ “3” మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే తాను ప్రస్తుతం నటిస్తున్న “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రంలో మూడు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్న రవితేజ.. తన తదుపరి చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ ఒకరిద్దరు హీరోయిన్లతో మాత్రమే ఆడిపాడిన రవితేజకు ముగ్గురు హీరోయిన్లతో నటించడం ఇదే మొదటిసారి.

వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా “నేల టికెట్టు” చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి నిర్మాణంలో రూపొందనున్న తాజా చిత్రంలో రవితేజ సరసన ముగ్గురు కథానాయికలు తళుక్కుమననున్నారు. ఆ ముగ్గురిలో తాజాగా “నన్ను దోచుకుందువటే” చిత్రంతో ప్రేక్షకుల్ని తన అందాలతో, అభినయంతో ఆకట్టుకొన్న నభ నటేష్ ఒకరు. మిగిలిన కథానాయికల ఎంపిక జరుగుతోంది. ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవ్వనుంది. ఈలోపు “అమర్ అక్బర్ ఆంటోనీ” విడుదలవుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus