దాసరి కోలుకున్నాకే ‘ఖైదీ’ విజయోత్సవ సభ నిర్వహిస్తామన్న చిరు

  • February 3, 2017 / 10:34 AM IST

దర్శకరత్న దాసరి నారాయణరావు పూర్తిగా కోలుకున్నాకే ఖైదీ నంబర్‌ 150 మూవీ విజయోత్సవ సభ నిర్వహిస్తామని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఆయన వేడుకకు ముఖ్య అథితిగా వచ్చిన నాడే ఆ కార్యక్రమం జరుపుతామని అప్పటివరకు వాయిదా వేస్తామని స్పష్టం చేశారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ దాసరి నారాయణరావు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ ల్లో చేరిన సంగతి తెలిసిందే. దాసరిని ఐసీయూలో ఉంచి వైద్య నిపుణులు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న డైరక్టర్ ని ఈరోజు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్‌, వి.వి.వినాయక్‌, మోహన్‌బాబు, జయసుధ తదితరులు పరామర్శించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.

“దాసరి నారాయణరావు ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన కోలుకుంటున్నారు. మరో రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది” అని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ” ఖైదీ నంబర్‌ 150 సినిమా కలెక్షన్ల గురించి దాసరి అడిగారు. నేను రూ.150కోట్లు దాటాయని చెప్పగా.. రూ.250కోట్లు దాటాలని పేపర్‌పై రాసి చూపించారు.” అని తెలిపారు. ‘ఖైదీ నంబర్‌ 150 చిత్ర విజయోత్సవ సభకు మీరే ముఖ్య అతిథిగా రావాలి. మీరు వచ్చే వరకు విజయోత్సవ సభను వాయిదా వేస్తాం’ అని దాసరితో అన్నట్లు చిరంజీవి చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus