ఎన్టీఆర్ ఆగ్రహానికి కారణం తెలిసింది

  • December 15, 2016 / 07:04 AM IST

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయనున్న మూవీ వివరాలను నిర్మాత కళ్యాణ్ రామ్ ప్రకటించడంతో అభిమానులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తారక్ మాత్రం చాలా కోపంగా ఉన్నారు. దర్శకుడు బాబీ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎందుకలా? అని ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది. కళ్యాణ్ రామ్ సినిమా అనౌన్స్ చేసి 24 గంటలు కూడా గడవక ముందే కథలో కీలక పాయింట్ మీడియాకి లీకైంది. ఎన్టీఆర్ త్రీ పాత్రాభినయం చేయనున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఎంతో రహస్యంగా ఉంచాల్సిన కీ పాయింట్ మీడియాకు ఎలా వెళ్లిందని ఎన్టీఆర్ ఆరా తీశారు.

డైరక్టర్ వైపు నుంచి ఈ వార్త లీకైనట్లు తెలియడంతో కోపంతో బాబీకి ఫోన్ చేశారు. ఇక నుంచి ఇటువంటి మిస్టేక్ లు జరగకుండా చూసుకోవాలని మందలించినట్లు సమాచారం. వందకోట్లతో రూపుదిద్దుకోనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్, మంజిమ మోహన్, అనుపమ పరమేశ్వరన్ ఆడి పాడనున్నారు. సంక్రాంతి అనంతరం సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో హరికృష్ణ, కళ్యాణ్ రామ్ కూడా ప్రత్యేక పాత్రలు పోషించనున్నట్లు టాక్. ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు వేరియేషన్లో విభిన్నంగా కనిపించడాకిని ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus