నా భర్త మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు

  • May 7, 2022 / 05:09 PM IST

ప్రముఖ నటి రోజా తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారనే సంగతి తెలిసిందే. రోజా భర్త సెల్వమణి తమిళ సినిమాలను చెన్నైలోనే షూట్ చేయాలని వైజాగ్, హైదరాబాద్ లో షూట్ చేయవద్దని కామెంట్లు చేయగా ఈ కామెంట్ల గురించి తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా స్పందించారనే సంగతి తెలిసిందే. అయితే ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో రోజా స్పందించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

తన భర్త చెప్పిన మాటలను తెలుగుదేశం పార్టీ నేతలు వక్రీకరిస్తున్నారని ఆమె వెల్లడించారు. తన భర్త సినిమా హీరోలు అక్కడే షూటింగ్ లు జరుపుకోవడం వల్ల అక్కడి కార్మికులకు ఉపాధి లభిస్తుందని చెప్పారని ఆమె అన్నారు. వైజాగ్ లో షూటింగ్ లు జరపాలని ప్రభుత్వం జీవోను ప్రకటించిందని మరి టాలీవుడ్ నిర్మాతలు అక్కడ సినిమాల షూటింగ్ లు చేస్తున్నారా? అని రోజా ప్రశ్నించడం గమనార్హం.

సీఎం జగన్ గారికి, ఆంధ్రప్రదేశ్ కు ఏపీ అంటే గౌరవం ఉందని అందువల్లే ఇక్కడ ఇళ్లు కట్టుకున్నామని రోజా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ ఎందుకు ఇల్లు కట్టుకోలేదని రోజా కామెంట్లు చేశారు. అందరికీ మంచి జరగాలని తన భర్త అలా చెప్పారని తెలుగుదేశం పార్టీ తన భర్త చెప్పిన మాటలను స్వార్థం కోసం వాడుకుంటుందని ఆమె వెల్లడించారు.

రోజా చేసిన కామెంట్ల గురించి టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రోజా చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రోజా ఇచ్చిన వివరణతో ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోతుందేమో చూడాలి. సెల్వమణి చెన్నైలోనే సినిమాల షూటింగ్ జరుపుకోవాలని సూచనలు చేసినా కొందరు తమిళ హీరోలు ఆ కామెంట్లను పట్టించుకోకుండా తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ లు జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజా మంత్రి పదవి వచ్చిన తర్వాత సినిమాలకు, టీవీ షోలకు గుడ్ బై చెప్పడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus