సాహో లేటెస్ట్ అప్డేట్

  • September 22, 2018 / 01:09 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. రీసెంట్ గా అబుదాబిలో ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేశారు. అలాగే కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లో వేసిన మార్కెట్ సెట్ లో కొని సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయినట్లు తెలిసింది. నెక్స్ట్ షెడ్యూల్ ను సుజీత్ ముంబయిలో ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ మొదలుకావడానికి కొంత ఆలస్యం అయ్యేట్టు ఉందని ఫిలిం నగర టాక్.

కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ముంబై లో చిత్రీకరించే సన్నివేశాల్లో కొంత మార్చాలని ప్రభాస్ చూసించారంట. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారు. ప్రభాస్ కి నచ్చే విధంగా సీన్ పేపర్ మీద వచ్చే వరకు షూటింగ్ వెళ్ళేది లేదని తెలిసింది. ఏ చిన్న సీన్ కూడా తక్కువ స్థాయిలో ఉండడకూడదని ప్రభాస్ ఫోకస్ పెట్టారు. ఆలస్యం అవుతున్నా కాంప్రమైజ్ కావద్దని అందరూ గట్టిగా ఉన్నారు. దసరాకి ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నప్పటికీ.. అటువంటి ఉద్దేశం సాహో చిత్ర బృందానికి లేదని తెలిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus