అబుదాబి వద్ద మొదలైన సాహో భారీ షెడ్యూల్.!

  • March 31, 2018 / 11:52 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ అబుదాబిలో మొదలయింది. దాదాపు 45రోజుల పాటు జరగబోయే ఈ భారీ షెడ్యూల్ కోసం గత కొన్ని రోజులుగా చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది. ఈరోజు నుంచి షూటింగ్ మొదలయినట్లు సమాచారం.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో ఈ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించనున్నారు. ఈ షూటింగ్ లో ప్రభాస్, శ్రద్ధ కపూర్, నీల్ నితిన్ ముకేశ్ తదితరులు పాల్గొననున్నారు. సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ 20 నిమిషాల పాటు ఉండనుంది. ఇందుకోసం టోటల్ బడ్జెట్ లో 40 శాతం కేటాయించారు. అబుదాబి షెడ్యూల్ తర్వాత యూనిట్ అంతా కలిసి దుబాయ్ వెళ్తుంది. అక్కడ బుర్జ్ ఖలీఫా పరిసర ప్రాంతాల్లో రిస్కీ ఛేజింగ్ సీన్ షూట్ చేయబోతున్నారు. ఈ కీలకమైన పార్ట్ కంప్లీట్ అయిన సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంలో చిత్ర బృందం ఓ కొలిక్కిరానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus