ఆ వార్తల్లో నిజం లేదండీ బాబు : తేజు

  • March 25, 2019 / 04:19 PM IST

మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’. ‘సెకండ్ హ్యాండ్’, ‘నేను శైలజ’ ‘ఉన్నదీ ఒకటే జిందగీ’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించింది. నివేథా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సందేహాలకు సాయితేజ్ ఆసక్తికరమైన సమాధానాలిచ్చాడు. గతంలో జుట్టు బాగా రాలిపోయే సమస్యతోనూ, అలాగే అధిక బరువు తగ్గించుకోవడానికి తేజు అమెరికా వెళ్ళాడనే ప్రచారం జరిగింది.

అయితే ఈ విషయం పై తేజ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. తేజు మాట్లాడుతూ… “మొన్నామధ్య నేను బరువు తగ్గాలనే ఉద్దేశంతో అమెరికా వెళ్ళి .. లైపో చేయించుకున్నానని…. అలాగే జుట్టు బాగా రాలిపోతుండటంతో కూడా.. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళానని చెప్పుకున్నారట. అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదండీ బాబు. ‘విన్నర్’ షూటింగు సమయంలో గుర్రం పై నుండీ పడిపోవడం వల్ల గాయపడ్డాను. పెద్దగా పట్టించుకోకుండా వరుస సినిమాలు చేయడం వలన, కాలు నొప్పి మరింత ఎక్కువైంది. అమ్మ కాంగారు పడుతుండటంతో, ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళాను .. అంతే” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus