మహేష్ సింప్లిసిటీ కి ఫిదా అయిన సాయి ధరమ్ తేజ్

  • February 15, 2017 / 07:44 AM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చిత్ర పరిశ్రమలోని అందరిహీరోలతో మంచి స్నేహం కొనసాగిస్తున్నారు. ఆ ఫ్రెండ్ షిప్ తోనే స్టార్ హీరోలు తేజు సినిమా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ మూవీలో “సితార” పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇలా పాటను విడుదల చేయమని మహేష్ ని అడగడానికి వెళ్ళినప్పుడు ఆసక్తికర సంఘటన జరిగిందంట. దానిని తేజు మిత్రులతో షేర్ చేసుకున్నారు. మురగదాస్ మూవీ షూటింగ్ స్పాట్ లో మహేష్ ని సాయి ధరమ్ తేజ్ కలిశారంట. అక్కడకు తేజు వచ్చాడని తెలియగానే మహేష్ తన షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారని తెలిసింది.

ప్రిన్స్ తేజు దగ్గరకు వచ్చి ఎంతో అభిమానంగా మాట్లాడారని, అతను అంత సింపుల్ గా ఉండడం చూసి మెగా హీరో  షాక్ తిన్నాడంటా. అంతేకాదు పాట రిలీజ్ చేయమని కోరగా.. వెంటనే ఒప్పుకునేసరికి సంతోషంలో సాయిధరమ్ తేజ్ కి మాటలు రాలేదని సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన విన్నర్ మూవీ ఈనెల 24 న రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus