సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చిత్రలహరి’..!

  • April 8, 2019 / 04:18 PM IST

‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’. సాయి తేజ్ హీరోగా నివేధా పేతురేజ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్ర పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదలైన టీజర్, ట్రైలర్లు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఏప్రిల్ 12 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి.

ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ను జారీ చేసారు. ఇక వారి రిపోర్ట్ ప్రకారం.. ఈ చిత్రం కచ్చితంగా ఆకట్టుకునే విధంగా తెరకెక్కిందట. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుందట. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభంలో పర్వాలేదనిపించినా… మధ్యలో సాగదీత ఎక్కువయ్యే ఫీలింగ్ అనిపిస్తుందట. ఇక క్లయిమాక్స్ మాత్రం ఫన్నీగా ఉందని… మంచి చిత్రం చూశామనే ఫీలింగ్ తో ప్రేక్షకులు థియేటర్ నుండీ బయటకి వస్తారని వారు చెబుతున్నారు. విజయం కోసం పరితపించే కుర్రాడి పాత్రలో తేజు ఈ చిత్రంలో నటించాడు. సినిమాలోనే కాదు బయట కూడా తేజు కి అర్జెంటుగా ఓ హిట్టు కావాలి. సో ‘చిత్రలహరి’ చిత్రం తేజుకి ఆ లోటును తీర్చే చిత్రమని వారు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus