స్పీడ్ పెంచిన సాయి ధరమ్ తేజ్..!!

  • July 30, 2016 / 01:21 PM IST

మెగా కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్.  ఉత్సాహంగా నటిస్తూ దూసుకుపోతున్న ఈ నటుడు సుప్రీం విజయంతో కమర్షియల్ హీరోగా నిరూపించుకున్నాడు. ఆ చిత్ర హిట్ కిక్కు దిగక ముందే తన తిక్కేంటో చూడమంటూ వచ్చేస్తున్నాడు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో “తిక్క” అనే మూవీని కంప్లీట్ చేసి.. ఆగస్టు 13 న విడుదలకు సిద్ధమయిపోయాడు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ అందించిన పాటలను నేడు విడుదల చేయనున్నారు.

తమిళ నటులు ధనుష్, శింబు రెండు తిక్క పాటలను ఆలపించడం విశేషం. అంతేకాదు ఈ చిత్రంలో థమన్ కూడా రాక్ స్టార్ గా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంటూనే సాయి ధరమ్ తేజ్ మరో ప్రాజెక్ట్ కి ఒకే చెప్పేసాడు. డాన్ శీను, బలుపు, బాడీగార్డ్, పండగ చేస్కో వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో పచ్చ జెండా ఊపేసాడు.

ఠాగూర్ మధు, నల్ల మల్లపు బుజ్జిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 20 నుంచి విదేశాల్లో మొదలు కానున్నట్లు సమాచారం. ఈ మూవీలో రకుల్ ప్రీతీ సింగ్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలిసింది. సమయాన్ని వృధా చేయకుండా సాయి ధరమ్ తేజ్ పక్కా ప్లాన్ తో కెరీర్ ని మలుచుకుంటున్నాడని సినీ విశ్లేషకులు ఈ యువ హీరోని అభినందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus