సాయిధరమ్ తేజ్ కంటే పోసాని ఎక్కువ మార్కులు కొట్టేశాడట

  • April 9, 2019 / 03:07 PM IST

“తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెల్లిజెంట్, తేజ్ ఐ లవ్ యూ” లాంటి ఆరు వరుస డిజాస్టర్ల తర్వాత సాయిధరమ్ నటించిన చిత్రం “చిత్రలహరి”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా ఈ శుక్రవారం (ఏప్రిల్ 12)న సినిమా విడుదలవుతోంది. సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శిని, నివేతా పేతురాజ్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెన్సార్ నిన్న పూర్తయ్యింది. కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ సంపాదించుకున్న ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ప్రకారం బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది.

తన జీవితం మొత్తం ఫెయిల్ అవుతూనే వచ్చిన ఓ కుర్రాడు ఆఖరికి విజయాన్ని అందుకొనే చివరి అవకాశాన్ని కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది “చిత్రలహరి” కథాంశం. సినిమాలో సాయిధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ కంటే పోసాని కృష్ణమురళి పోషించిన తండ్రి పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వినికిడి. ఎవ్వరూ ఊహించని విధంగా ఎమోషనల్ గా క్లైమాక్స్ ఉండబోతోందని కూడా సమాచారం. సో, అరడజను ఫ్లాపుల తర్వాత సాయిధరమ్ తేజ్ ఫైనల్ గా ఒక హిట్టు కొట్టబోతున్నాడన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus