Samantha: ఫ్యాన్స్ కు సామ్ ఇచ్చిన స్పెషల్ సర్ప్రైజ్ ఇదే.. ఎవరూ ఊహించలేదుగా!

  • August 21, 2024 / 08:56 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత (Samantha) ఈ రోజు సోషల్ మీడియాలో స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నానంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త చెబుతారేమో అని చాలామంది భావించారు. ఈ మధ్య కాలంలో సమంత పర్సనల్ లైఫ్ కు సంబంధించి కొన్ని వార్తలు నెట్టింట తెగ వైరల్ కావడం జరిగింది. అయితే తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టానని సమంత స్పెషల్ సర్ప్రైజ్ ను రివీల్ చేశారు.

Samantha

వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంఛైజీని తాను కొనుగోలు చేశానని ఆమె పేర్కొన్నారు. చెన్నై ఫ్రాంఛైజీ టీమ్ కు తాను యజమానిగా ఉండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సామ్ అన్నారు. న్యూ బిగినింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడిస్తూ సమంత ఈ కామెంట్స్ చేశారు. అయితే పికిల్ బాల్ గేమ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువమందికి మాత్రమే అవగాహన ఉంది.

టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ను పోలి ఉండే ఈ ఆటకు కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఈ ఆటకు మన దేశంలో సైతం ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. 1965 సంవత్సరంలో అమెరికాలో ఈ ఆట మొదలైందని భోగట్టా. ఈ ఆటలో సింగిల్స్ లో ఇద్దరు, డబుల్స్ లో నలుగురు ఆడతారని తెలుస్తోంది. ఇండోర్ లో అయినా అవుట్ డోర్ లో అయినా ఈ ఆట ఆడొచ్చని సమాచారం.

సమంత ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు. సినిమాలు, పలు వ్యాపారాలలో సక్సెస్ సాధించిన సమంత చెన్నై టీమ్ కు యజమానిగా కూడా తన లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో త్వరలో సమంత ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సమంత మా ఇంటి బంగారం అనే సినిమాతో సైతం త్వరలో బిజీ కానున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus