మరో వైవిధ్యమైన పాత్రలో రావు రమేష్

  • December 22, 2018 / 12:55 PM IST

రీసెంట్‌గా యూట‌ర్న్ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంతో అల‌రించిన స‌మంత మ‌రోసారి క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సన్నద్ధమవుతోంది. నందినీరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. నందిని రెడ్డి- స‌మంత కాంబినేష‌న్‌లో రానున్న ఈ రెండో చిత్రం కొరియన్ భాషలో తెరకెక్కిన మిస్ గ్రానీకి రీమేక్ అంటున్నారు.

ఇందులో స‌మంత 70 ఏళ్ళ వృద్ధురాలి పాత్ర‌లో క‌నిపించినుంద‌ట‌. అయితే తాను 20 యేళ్ల యువతిగా మారిపోతే ఎలా ఉంటుంది.. తనకి 50 యేళ్ల కొడుకు ఉంటే ఎలా ఉంటుంది అని క‌లలు కంటుంద‌ట‌. ఆ 50 ఏళ్ళ కొడుకు పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. స‌మంత‌, రావు ర‌మేష్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని అంటున్నారు. తెలుగు రీమేక్‌కి ఓ బేబి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus