Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Advertisement

‘కేడీ: ది డెవిల్‌’ సినిమాలోని ‘సర్కే చునార్‌ తేరీ సర్కే’ అనే హిందీ పాట వివాదం మీకు గుర్తుండే ఉంటుంది. మొన్నీమధ్య వరకు పెద్ద ఎత్తున చర్చకు కారణమైన ఆ పాట వివాదంలో ఇప్పుడు మరో అప్‌డేట్‌ వచ్చింది. ధ్రువ్‌ సర్జా కథానాయకుడిగా పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొంది, విడుదలకు సిద్ధమైన ఆ సినిమాలో నోరా ఫతేహి, సంజయ్‌ దత్‌ మీదనే ‘సర్కే చునార్‌..’ పాటను తెరకెక్కించి ప్రచారం పరంగా రిలీజ్‌ చేశారు. అయితే ఆ పాట సాహిత్యం, డ్యాన్స్‌ అసభ్యంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి పాటను అన్ని వేదికల మీద డిలీట్‌ చేయించింది.

Sanjay Dutt

అయితే, విషయం అక్కడితో ఆగలేదు. దీనిపై అప్పటికే వచ్చిన ఫిర్యాదులతో జాతీయ మహిళా కమిషన్‌ ఆ పాటతో సంబంధం ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం జాతీయ మహిళా కమిషన్‌ ఎదుట సంజయ్‌ దత్‌ హాజరయ్యాడు. సమాజానికి అనుకోకుండా కలిగిన హాని పట్ల విచారం వ్యక్తం చూస్తూ లిఖిత పూర్వక క్షమాపణ పత్రం అందించారు. జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది.

ఈ సందర్భంగా సంజయ్‌ దత్‌ స్పందిస్తూ.. సామాజిక సంక్షేమం, మహిళా సాధికారిత దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, అలాగే సినిమా విషయంలో జరిగిన వివాదానికి దిద్దుబాటు చర్యగా 50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారని మహిళా కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్‌ కంపెనీ ప్రతినిధులు గౌతమ్‌ కె.ఎం, సుప్రీత్, గీత రచయిత రకీబ్‌ ఆలం, సినిమా దర్శకుడు ప్రేమ్‌ కమిషన్‌ ముందు హాజరై క్షమాపణలు కోరారు. నోరా ఫతేహి విచారణకు హాజరు కావాల్సి ఉన్నా విదేశాల్లో ఉన్న కారణంగా రాలేకపోయింది.

మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus