తనకు న్యాయం చేయాలనీ నిరాహార దీక్ష చేస్తున్న సంపత్ కుమార్

  • March 17, 2017 / 07:59 AM IST

సర్దార్ గబ్బర్ సింగ్ అపజయం పవన్ కళ్యాణ్ ని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆ చిత్రాన్ని కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి తన కాటమరాయుడు రైట్స్ అందించి మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ కొన్న కృష్ణ జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ని మాత్రం పక్కన పెట్టారు. ఆయన కొన్ని రోజుల క్రితం  ప్రెస్ మీట్ పెట్టి తనకు కాటమరాయుడు హక్కులు ఇవ్వడం లేదని, సర్దార్ వల్ల అయిన 2 కోట్ల అప్పులను ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పవర్ స్టార్ అతని గురించి పట్టించుకోలేదు. డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కాటమరాయుడు రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో పాటు, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి అయిపోయింది.

ఈ సమయంలో మరో మారు సంపత్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. అతడు శుక్రవారం ఫిల్మ్‌ చాంబర్‌ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు.  కాటమరాయుడు సినిమా రైట్స్‌ ఇస్తామని నిర్మాత శరత్‌ మరార్‌ మొదట్లో హామీ ఇచ్చారని, ఇప్పుడు మాత్రం వేరే డిస్ట్రిబ్యూటర్ కి అధిక ధరకు అమ్ముకుని మాట తప్పారని సంపత్  ఆరోపించారు. ఈ విషయంలో పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus