“సినీ పరిశ్రమను” షేక్ చేస్తున్న బన్నీ క్రేజ్!!!

  • May 30, 2016 / 08:57 AM IST

టాలీవుడ్ టాప్ హీరో ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది మహేష్ బాబు, పవన్ కల్యాణ్. అయితే ఈమధ్య తాజాగా విడుదలయిన ఆ ఇద్దరు హీరోల సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మనడంతో ఇప్పుడు టాప్ హీరో కుర్చీపై కన్నేసాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అల్లు అర్జున్ కి ‘సరైనోడు’ రూపంలో ఆ అవకాశం దొరికింది.

అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్లను మినహాయిస్తే మరి ఏ పరభాషా హీరోకి దక్కని ఆదరణ ఇప్పడు బన్నీకి  లేటెస్ట్ గా కేరళలో దక్కడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  మొన్న శుక్రువారం ‘సరైనోడు’ మలయాళ వెర్షన్ ‘యోధవు’ విడుదల సందర్భంగా కేరళలో నెలకొన్న హంగామా అంతా ఇంతాకాదు. స్వయంగా అల్లు అర్జునే ఆ హంగామా చూసి ఆశ్చర్యపోయినట్లు టాక్. దీనితో కేరళలో తన సినిమా విడుదల సందర్భంగా నెలకొన్న హడావుడికి సంబంధించిన ఫొటోలు తన పేస్ బుక్ లో షేర్ చేసి ఇంత అభిమానం చూపిస్తున్న అభిమానులకు చాలా థ్యాంక్స్ అని ట్విట్ చేసాడు. ఇక దాదాపుగా 80 స్క్రీన్లలో రిలీజైన ‘యోధవు’కు అదిరిపోయే ఓపెనింగ్స్ రావడంతో లాంగ్ రన్ లో నాలుగైదు కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా…అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని ఊరికినే ఆన్నారా!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus