మహేష్, రామ్ చరణ్ ల పై సంచలన వ్యాఖ్యలు చేసిన శేఖర్ కమ్ముల!

  • July 22, 2017 / 11:03 AM IST

ఆనంద్, హ్యాపిడేస్ లాంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల తరువాత ఫాం కోల్పోయి కష్టాల్లో పడ్డాడు. అయిన కూడా స్టార్ హీరోలు శేఖర్ కమ్ముల చెపుతున్న కధలు వింటున్నారు కాని ఈ డైరెక్టర్ కు డేట్స్ ఇవ్వడంలేదు. ఈ పరిస్థితులలో నిన్న విడుదల అయిన తన ‘ఫిదా’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఈ విలక్షణ దర్శకుడు టాలీవుడ్ టాప్ హీరోల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

‘లీడర్‌’ కథ మహేష్‌ కు చెబితే అతడు చేయను అన్న విషయాన్ని వివరిస్తూ ‘ఫిదా’ స్టోరీని కూడా మహేష్‌కి, చరణ్‌కి వినిపించినా వారు చేయనున్నారు అని గుర్తుకు చేసుకున్నాడు. ఇదే సందర్భంలో ఈ దర్శకుడు మాట్లాడుతూ ప్రేక్షకుల అభిరుచి మారుతోందని ఒకే తరహా మూస సినిమాలని వారు ఇష్టపడడం లేదని అయితే ఈ విషయాలు ఇప్పటికీ చాలామంది స్టార్ హీరోలు గుర్తించడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే తాను టాప్ హీరోల కోసం తన పద్ధతి మార్చుకోను అని అన్నారు, టాప్ హీరోలు తనలా ఆలోచించే దర్శకులని గుర్తించాలని అంటూ తన అసహనాన్ని వ్యక్త పరిచాడు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus