రజినీ ఆరోగ్యం పై సీనియర్ హీరోయిన్ కామెంట్స్..!

  • October 31, 2020 / 06:12 AM IST

కొద్దిరోజుల నుండీ రజినీకాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అందువల్లనే ఆయన ఇక రాజకీయాలకు దూరమవుతున్నారని ఇటీవల ఓ లేఖ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. అది రజినీ నుండీ కానీ… ఆయన టీం నుండీ కానీ.. వచ్చినది కాకపోయినా… అందులో ఉన్న మ్యాటర్ నిజమేనని.. రాజకీయాలకు ఆయన దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు.. రజినీ స్పష్టంచేసారు .నిజానికి గతంలో ఓసారి రజినీకి కిడ్నీ మార్పిడి జరిగింది. దాంతో ఆయనకి ఇమ్మ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుందట.

ఈ టైములో కరోనా అటాక్ అయితే చాలా ప్రమాదం అనే చెప్పాలి. అంతేకాదు ఇలాంటి టైములో పార్టీ పెట్టి బయట తిరగడం మొదలుపెడితే చాలా ప్రమాదం. అభిమానులకు ఇది కొంత చేదు వార్తే అయినప్పటికీ.. తప్పడం లేదని చెన్నై మీడియా వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా.. తాజాగా రజనీ ఆరోగ్యం పై సీనియర్ హీరోయిన్ మరియు బీజేపీ నాయకురాలు అయిన ఖుష్బూ స్పందించారు. ఆమె తన ట్విట్టర్ ద్వారా రజినీ ఆరోగ్యం పై స్పందిస్తూ..

“ప్రియమైన రజనీకాంత్ గారికి…మీ ఆరోగ్యం కంటే మాకు ఏదీ ఎక్కువ కాదు. మీ మనసు వజ్రం లాంటిది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి మీరు ఏది చెయ్యాలి అనుకుంటే అదే చెయ్యండి. మీ పై మాకున్న ప్రేమ ఏ కారణంగానూ తగ్గదు. జీవితాంతం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాము’ అంటూ పేర్కొంది ఖుష్బూ.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus