మహేష్ హీరోయిన్ కి అంతా..!!

  • June 13, 2016 / 12:09 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం తర్వాత చేయనున్న సినిమా పనులు ఊపందుకున్నాయి. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో రానున్నఈ చిత్రాన్నిరూ.90 కోట్ల బడ్జట్ తో తెలుగు, తమిళం భాషల్లో నిర్మించనున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోంది. ఈ మూవీని హిందీలో కూడా విడుదల చేయాలనీ ఉద్దేశంతో బాలీవుడ్ తారను ఎంపిక చేసారు. అయితే ఆమె రెమ్యూనరేషన్ రూ. 3.5 కోట్లు కావడం ఒక సెన్సేషన్ గా మారింది.

ఆ మొత్తం కొంత మంది నేటి తెలుగు యువ హీరోల రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా ఉండడంతో ఔరా అంటున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోయిన్ ఇన్నికోట్లు తీసుకోలేదు. మూడు కోట్ల రూపాయల మార్కుకు అరుంధతి అనుష్క మాత్రమే దగ్గరగా ఉంది.  ఇలా క్రేజీ సంగతులతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే వార్తల్లో నిలుస్తోంది.

మహేష్ రూ.28 కోట్లు అందుకోనున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ గ్రహీత సినిమాటో గ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్నారు. సినిమా మొత్తం ప్రత్యేక టోన్ లో ఉండే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తమిళ్  డైరక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా కనిపించనుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రం జులై 19 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ముందుగా మహేష్, పరిణీతి చోప్రాల పై పాట చిత్రీకరించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus