దర్శక.. నిర్మాతలకి షాకిచ్చిన శ్రుతీ హాసన్..!

  • January 2, 2019 / 02:05 PM IST

అతి తక్కువ కాలంలో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రుతి హాసన్. కమల్ హాసన్ కుమార్తె గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. నటనతో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకుంది. చాలా తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాంచరణ్,జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. ఒక పక్క కోలీవుడ్, టాలీవుడ్ లో రాణిస్తూనే బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించింది శ్రుతీ.

అయితే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు .. తమిళ సినిమాలకు కూడా చాలా దూరమవ్వడం గమనార్హం. శ్రుతి హసన్ ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ప్రవర్తిస్తుందని… దానివలనే దర్శక నిర్మాతలతో చిన్న చిన్న విబేధాలు చోటుచేసుకుంటాయని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం మరోసారి స్పష్టమైందనే చెప్పాలి. మరాఠీ చిత్రాల దర్శకుడు .. నటుడు మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించబోయే సినిమాలో శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా ఎంచుకున్నాడు. ఆయన షూటింగ్ డేట్ ఇచ్చి .. ఆ రోజు షూటింగుకి రమ్మని ఫోన్ చేశాడట. అయితే నిర్మాతలతో ముందుగా మాట్లాడుకున్న ప్రకారం రెమ్యూనరేషన్లో సగం అడ్వాన్స్ గా ఇస్తేనే షూటింగుకు వస్తాననీ .. లేదంటే రానని శ్రుతి హాసన్ తేల్చి చెప్పిందట. శృతి హాసన్.. రెమ్యూనరేషన్ విషయంలో ఇలా చేయడం పట్ల సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus