చరణ్ కి ‘సైమా’ దక్కింది.. మరి మహేష్ కి?

2018 లో విడుదలైన రాంచరణ్ ‘రంగస్థలం’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమర్షియల్ హీరోలు అయ్యుండి కూడా వీళ్ళు చేసిన ప్రయోగాలకి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రాలు కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను కూడా క్రియేట్ చేసాయి. ఓవర్సీస్ లో అయితే ‘బాహుబలి’ తరువాత 3 మిలియన్ క్లబ్ దాటిన సినిమాలు ఇవే కావడం విశేషం. ఇక ఇటీవల జరిగిన సైమా 2019 అవార్డుల్లో ‘రంగస్థలం’ 9 అవార్డులు గెలుచుకుంది. అయితే ‘భరత్ అనే నేను’ చిత్రాలకి సైమాలో అవార్డులు దక్కలేదు. అయితే త్వరలో ప్రకటించబోయే నంది అవార్డుల్లో ‘భరత్ అనే నేను’ చిత్రానికి అవార్డుల పంట పండనుందని తెలుస్తుంది.

అయితే ‘రంగస్థలం’ చిత్రానికి కూడా అవార్డులు గట్టిగానే వచ్చాయని కూడా సమాచారం. కానీ ఒక్క విషయం పై మాత్రం అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏంటంటే ఉత్తమ నటుడు కేటగిరిలో చరణ్ కి అవార్డు లభిస్తుందా లేక మహేష్ కు అవార్డు లభిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కచ్చితంగా మహేష్ కి అవార్డు వస్తుంది అని ఆయన అభిమానులు కోరుకుంటుంటే.. మా చిట్టిబాబు(రాంచరణ్) కే అవార్డు వస్తుందని మెగా అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. మరి వీరిలో ఎవరి కోరిక నెరవేరుతుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus