వైభవంగా ముగిసిన సైమా వేడుక!

  • July 3, 2017 / 12:37 PM IST

దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతో అబుదాబి మెరిసిపోయింది. సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకలు అవార్డులు, అందాలతో  కళకళలాడింది. తొలిరోజు (శుక్రవారం) తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాల్లో ఉత్తమ ప్రదర్శించిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, ఉత్తమ నటిగా రకుల్ ప్రీత్ సింగ్, ఉత్తమ చిత్రంగా  ‘పెళ్లిచూపులు’  ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి అవార్డ్స్ అందుకున్నారు. సైమా వేడుక సందర్భంగా రెజీనా, ప్రణీత, నిక్కీ గల్రానీ డ్యాన్సులతో అదరగొట్టగా, అఖిల్ అక్కినేని పాట పాడి ఆకట్టుకున్నారు. ‘దువ్వాడ: జగన్నాథమ్’ వేషధారణలో అల్లు శిరీష్ చేసిన సందడి నవ్వులను పంచింది.

ఇక వేడుకలో రెండో రోజు (శనివారం) తమిళయం, మలయాళం చిత్ర పరిశ్రమలకు చెందిన వారికీ అవార్డులను అందించారు. ముగింపు వేడుకకు బాలీవుడ్ తారలు రణబీర్ కపూర్, కత్రినా కపూర్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేదికపై నాని, రానా, రణబీర్ కపూర్, మాధవన్ పంచె కట్టుతో అలరించారు. ఈ కార్యక్రమానికి కూతురుతో కలిసి మీనా హాజరుకాగా హాట్ డ్రస్సులో శ్రీయా, సీరత్ కపూర్, నయన తార, త్రిషలు దర్శనమిచ్చి కనువిందుచేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus