వెనుక బడ్డ ఎన్టీఆర్…’స్పైడర్’దే పైచేయి!

  • August 27, 2017 / 10:56 AM IST

టాలీవుడ్ ను దున్నుతున్న యువ హీరోల్లో ఎన్టీఆర్ మరియు ప్రిన్స్ మహేశ్ బాబు ఇద్దరూ ఇద్దరే. అయితే ఎవరి రేంజ్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి సినిమాలు వాళ్ళవి. ఇదిలా ఉంటే అప్పట్లో అంటే మనకు 100రోజులు, 175రోజులి అంటూ ఉండేవి కానీ, ఇప్పుడు అంతా సినిమా ఎంత కలెక్ట్ చేసింది? సినిమా టీజర్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్ అందుకుంది ఇలా అన్నీ లెక్కల మయం అయిపోయింది. అయితే ఆ లెక్కల భారతంలోకి ఒక్కసారి వెళ్ళి తొంగి చూస్తే అసలు మ్యాటర్ కనిపిస్తుంది. విషయం ఏమిటి అంటే, ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ విడుదలకు రెడీ అవుతున్న “జై లవ కుశ” సినిమాలోని రెండవ పాత్ర ‘లవ’ ను పరిచయంచేస్తూ విడుదలచేసిన టీజర్ జూనియర్ అభిమానులకు విపరీతమైన జోష్ ను కలిగించినా ఆటీజర్ యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టడంలో విఫలం కావడం అత్యంత  షాకింగ్ గా  మారింది.

దీనికితోడు లేటెస్ట్ గా విడుదలైన  ‘జై లవ కుశ’  టీజర్ ‘స్పైడర్’ రెండవ టీజర్ క్లిక్స్ కు  చాలాదూరంలో నిలిచిపోవడం ఊహించని పరిణామంగా మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘స్పైడర్’ రెండవ టీజర్ కంటే ‘జై లవకుశ’ రెండవ టీజర్ బాగుందన్న టాక్  వచ్చినా  ఈటీజర్ కు సంబంధించి క్లిక్స్ విషయంలో అంచనాలు తారుమారు కావడం  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  దీనికితోడు  ‘స్పైడర్’ రెండవ టీజర్ కు 24 గంటలలో అందుకున్న 4.04 మిలియన్ క్లిక్స్ ను అవలీలగా ‘జై లవ కుశ’ అధిగమించేస్తాడని  జూనియర్  ఫ్యాన్స్ ఆశించారు. కానీ 24 గంటలు పూర్తయ్యే సమయానికి ‘జై లవ కుశ’ కు రెండవ టీజర్ కు  కేవలం 3.2 మిలియన్ క్లిక్స్ ను మాత్రమే అందుకోవడం  ఎవరికీ అర్ధంకాని  విషయంగా మారింది. అయితే అదే క్రమంలో ‘జై’ పాత్రను పరిచయంచేసిన టీజర్ కు మాత్రం 4.89 క్లిక్స్ తో ‘స్పైడర్’ మొట్టమొదటి టీజర్ కన్నా ముందు స్థానంలో ఉంది. మొత్తంగా చూసుకుంటే ఎవరి టాప్? ఎవరు నెక్స్ట్ అనే దానికన్నా….రెండూ అభిమానుల అంచనాలను అందుకున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus