ఎన్టీఆర్, బాబీ చిత్రానికి మహానటుడు సినిమా పేరు ఫిక్స్

  • January 9, 2017 / 07:32 AM IST

జనతా గ్యారేజ్ రికార్డులను బద్దలు కొట్టడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిద్ధమయ్యారు. అందుకే బాబీ చెప్పిన  వినూత్నకథను ఎంచుకున్నారు. మూడు పాత్రల్లో మెప్పించడానికి కసరత్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీకి తాజాగా టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ నెల 26 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఎన్టీఆర్ 27వ చిత్రానికి మహానటుడు నందమూరి తారకరామారావు సినిమా పేరుని ఖరారు చేశారు.  ‘జై లవకుశ’ అనే పేరుని నిర్మాత కళ్యాణ్ రామ్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఈ కథలో లవకుశ నే ఇద్దరు కవలలు కాగా, జై అనే అతను యాంటీ హీరోగా కనిపించనున్నారు.

ఈ మూడు పాత్రల్లో తారక్ నట విశ్వరూపం చూపించనున్నారు. ఎన్టీఆర్ గతంలో ఆంధ్రావాలా, అదుర్స్ చిత్రాల్లో  ద్విపాత్రాభినయం చేశారు. తొలిసారిగా త్రిపాత్రాభినయం ఇందులో చేస్తున్నారు. అది కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. పూర్తిస్థాయిలో తారక్ నటనను ఇందులో చూడవచ్చు. అందుకే కళ్యాణ్ రామ్ ఈ ప్రాజక్ట్ ని  వందకోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్, మంజిమ మోహన్ లు కథానాయికలుగా నటిస్తుండగా, కీలక పాత్రలో శ్రీదేవి కనిపించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus