వివాదాస్పద కామెంట్స్ చేసిన ‘శ్రీదేవి బంగ్లా’ డైరెక్టర్ ..!

  • January 18, 2019 / 06:59 AM IST

మళయాళ దర్శకుడు ప్రశాంత్‌ మాంబుల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ‘శ్రీదేవి బంగ్లా’ చిత్రం.. స్టార్ హీరోయిన్,దివంగత శ్రీదేవి బయోపిక్ లా ఉందంటూ కొందరు ఆరోపనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌.. ఈ చిత్ర యూనిట్ కి నోటీసులు కూడా పంపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వివాదం పై తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ మాంబుల్లి చేసిన కామెంట్స్ మరింత సంచలనమవుతున్నాయి.

ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ”నేను శ్రీదేవికి వీరాభిమానిని. ఆమె బాత్‌టబ్‌లో పడి చనిపోయినంత మాత్రాన ఇంకెవ్వరూ అలా చనిపోకూడదని.. లేదు కదా? మమ్మల్ని సినిమా విడుదల చేసుకోనివ్వండి. బోనీ కపూర్‌ మాకు పంపిన నోటీసులను మేం ధైర్యంగా ఎదుర్కొంటాం. అనుమతి లేకుండా ఒకరిపై బయోపిక్‌ తీయకూడదన్న విషయం మాకూ తెలుసు. శ్రీదేవి అనే నటి లండన్‌లో ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అన్న నేపథ్యంలో నేను కథ కూడా రాసుకున్నాను. అలాగే ఇది క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం. అలాంటప్పుడు సినిమాలోని సస్పెన్స్‌ గురించి ముందే చెప్పలేను. సినిమా గురించి ప్రశ్నిస్తున్నవారందరికీ కథ చెప్పుకొంటూ కూర్చోలేను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక హీరోయిన్ ప్రియా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ”శ్రీదేవి.. ఇది జస్ట్‌ సినిమాలో నా పాత్ర పేరే కదా.. అందులోనూ హీరోయిన్ పాత్ర కావడం కాంట్రవర్సీ అయిపొయింది. దానికే ఇంత రాద్దాంతం ఎందుకు? ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కాబట్టి సినిమా శ్రీదేవి నేపథ్యంలో తెరకెక్కించిందా? కాదా? అన్నది ప్రేక్షకులకే వదిలేయాలి” అంటూ పేర్కొంది. ఇక ఈ చిత్రం ‘శ్రీదేవి బయోపిక్’…? అవునా..? కాదా..? అన్న విషయం తెలుసుకోవాలంటే ముందు మీరు సినిమా చూడండి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్‌స్టార్‌ పాత్రలో నటిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. మరి ముందు… ముందు… ఈ చిత్రం ఇంకెన్ని వివాదాలకు తెరలేపుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus