తాగుతూ డ్రైవ్ చేసినందుకు పోలీసులు పట్టుకుపోయారు : కార్తికేయ

  • February 4, 2017 / 10:29 AM IST

కొంతకాలం క్రితం యువ హీరోలు నిఖిల్, శర్వానంద్ తదితరులు మోతాదు కంటే మించి తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కన సంగతి అందరికీ తెలిసిందే. ఈ జాబితాలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఉన్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. జక్కన్న సోదరుడు ఎస్.ఎస్. కాంచి దర్శకుడిగా మారి తీసిన తొలి చిత్రం “షో టైమ్”.  ‘రామా రీల్స్’ పతాకంపై  జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక నిన్న వైభవంగా జరిగింది. ఎమ్ ఎమ్ కీరవాణి స్వరపరిచిన గీతాల్లో ఒక పాటను కార్తికేయ పాడడం విశేషం.

ఈ కార్యక్రమానికి హాజరైన కార్తికేయ మాట్లాడుతూ తాను ఆల్కహాల్ తాగుతూ కారు నడుపుతుండగా పోలీసులు పట్టుకుపోయారని తెలిపారు. “మద్యం సేవించి వాహనం నడపడం తప్పు అని తెలుసుకానీ.. డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేయడం కూడా తప్పని నాకు తెలియదు” అని కొన్నిరోజుల క్రితం జరిగిన సంఘటనను అందరి ముందు గుర్తుచేసుకున్నారు. అప్పటినుంచి ఆ తప్పు చేయలేదని వెల్లడించారు. సూపర్ హిట్ చిత్రాలైన ఈగ, మర్యాద రామన్న చిత్రాలకు కథ అందించిన కాంచి , ఛత్రపతి, యమదొంగ, విక్రమార్కుడు, మగధీర వంటి చిత్రాలకు సహా రచయితగా పని చేశారు. తొలిసారిగా దర్శకత్వం వహించిన  షో టైమ్’ మూవీ ఈనెల ఆఖరి వారంలో రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus