నయన తార మైండ్ బ్లాక్ చేసిన హీరో అతనే..!

  • June 10, 2020 / 10:00 AM IST

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక.. నయన తార పూర్తిగా తన సినిమాల పైనే దృష్టి పెట్టింది. అప్పటికే సినిమాల పరంగా.. ‘నయన్ పనైపోయింది’ అని కామెంట్స్ చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ‘ఆరంభం'(తెలుగులో ‘ఆట ఆరంభం’), ‘రాజా రాణి’ వంటి చిత్రాలు ఈమెకు తిరిగి లైఫ్ ఇచ్చాయనే చెప్పాలి. అప్పటి నుండీ కథా ప్రాధాన్యత ఉండే పాత్రలను అలాగే.. నాయికా ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగింది. ఈ దశలో కెరీర్ ప్రారంభానికంటే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.

అయితే తాను నటించే సినిమాల ప్రమోషన్లకు మాత్రం నయన్ దూరంగా ఉంటూనే వచ్చింది. బహుశా ‘ప్రభుదేవా తో బ్రేకప్ కు కారణాలు అడిగి మీడియా వారు ఇబ్బంది పెడతారు అనే ఉద్దేశంతో ఆమె ప్రమోషన్లకు దూరంగా ఉండేదని’ అప్పట్లో వార్తలు వచ్చేవి. కానీ ‘ఆరం’ (తెలుగులో ‘కర్తవ్యం’) చిత్రంప్రమోషన్లకు హాజరయ్యింది. ఎందుకంటే ఇది ఆమెకు చాలా ఇష్టమైన కథ. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రమోషన్లకు వెళ్ళింది. ఇక ఈ చిత్రానికి గాను నయన్ కు బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరిలో అవార్డు దక్కింది. ఈ వేడుకకి మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా హాజరయ్యాడు.

ఇతన్నే నయన్ కు అవార్డు ప్రధానం చెయ్యమని నిర్వాహకులు తెలిపారు. దాంతో నయన్ స్టేజి పైకి రావడమే ‘ఐ లవ్ యు నయన్’ అంటూ చెప్పాడు దుల్కర్. ‘నిన్ను ఇష్టపడే కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒకడిని.. మీ ‘రాజా రాణి’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడట. దుల్కర్.. నయన్ కు ‘ఐ లవ్ యు’ చెప్పడమే అక్కడున్న వారంతా షాక్ అయ్యారని.. నయన్ ఇటీవల ఓ సందర్భంలో గుర్తుచేసుకుందని సమాచారం.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus