పోటీ కొస్తున్నా… హిట్ కావాలని కోరుకుంటున్న తారలు

  • August 8, 2017 / 02:50 PM IST

ఏ రంగమైనా పోటీ అనేది ఉంటుంది. ఉండాలి. అప్పుడే గెలవాలనే కసి..గెలిచినప్పుడు ఆనందం ఉంటుంది. ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉంటే ఓడినా ఆనందమే. ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ తెలుగు చిత్రపరిశ్రమలో ఉందని నేటి నటీనటులు చాటి చెప్పారు. ఈ శుక్రవారం (ఆగస్టు 11)  హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన “లై”,  రానాతో తేజ తీసిన నేనే రాజు నేనే మంత్రి విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయ జానకి నాయక రిలీజ్ కాబోతోంది. సో ఆగస్టు 15 సాక్షిగా గట్టి పోటీ జరగనుంది. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో .. అనే విషయం పక్కన పెడితే.. ఈ చిత్రాల్లోని తారలు సోషల్ మీడియా సాక్షిగా ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నారు.

ముందుగా రానా దగ్గుబాటి.. రకుల్ ప్రీత్ సింగ్, నితిన్ లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మన సినిమాలు విజయం సాధించాలని విష్ చేశారు. దీంతో వెంటనే “థాంక్స్.. నీక్కూడా ఆల్ ది బెస్ట్” అని  రకుల్ రీ ట్వీట్ చేశారు. నితీన్ కూడా “థ్యాంక్ యూ సో మచ్ బ్రో.. మనందరి సినిమాలు హిట్ కావాలి” అంటూ ఆకాంక్షించారు. వీరి మధ్య జరిగిన సంభాషణ తెలుగు చిత్ర పరిశ్రమలోని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రతిభింబిస్తోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus