రూమర్లపై స్పందించిన సుజీత్!

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. దుబాయ్ లో యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి టీమ్ కష్టపడుతోంది. 2 నెలల పాటు జరగనున్న ఈ ఫైట్ సినిమాలో కీలకం కానుంది. అయితే కొన్ని రోజులుగా ఓ రూమర్ షికారు చేస్తోంది. డైరక్టర్ సుజీత్ తో ప్రభాస్ కి మధ్య గొడవలు వచ్చాయని, అనవసరపు షాట్స్ ఎక్కువగా తీస్తున్నందుకు ప్రభాస్ కోపంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్నీ ఓ నెటిజన్ నేరుగా సుజీత్ ని అడిగారు. అందుకు సుజీత్ సరదాగా సమాధానమిచ్చారు.  “అంతా బాగానే జరుగుతోంది.

చాలా వేగంగా పనులు చేస్తున్నాం. మధ్యలో ఇలాంటి వార్తలు మాకు ఎంటర్టైన్మెంట్ లాంటివి’ అంటూ బదులిచ్చారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పైగా సుజీత్ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో అర్ధమయింది.  యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధ కపూర్, విలన్ గా నీల్ నితిన్ ముకేష్, మరికొన్ని కీలక పాత్రలో చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ, టిన్ను ఆనంద్ లు నటిస్తున్నారు. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.img_15032018_103841_0

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus