మెగా హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్న సుకుమార్

  • September 7, 2018 / 06:47 AM IST

మెగా హీరోలతో మంచి సినిమా తీయగలిగితే కలెక్షన్లు పరుగులు తీస్తాయి. ఆ విషయాన్ని సుకుమార్ రంగస్థలం సినిమాతో మరో మారు తెలుసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అందుకే మెగా హీరో కోసం సుకుమార్ ప్రయత్నాలు మొదలెట్టారు. రంగస్థలం తర్వాత సుకుమార్ మహేష్ బాబుతో కదా సినిమా తీసేది?.. మళ్ళీ మెగా హీరో అంటున్నారేంటి? అనే అనుమానం రాకమానదు. నిజమే సుకుమార్ రంగస్థలం తర్వాత మహేష్ బాబుతోనే సినిమా తీయనున్నారు. మైత్రి మూవీస్ వారు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇందుకు సుకుమార్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ మూవీ పనుల్లోనే ఉంటూనే

నిర్మాతగాను ఓ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నారు. భిన్నమైన కథలతో సుకుమార్ రైటింగ్స్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి మెగా హీరోతో సినిమా నిర్మించాలని అనుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్ తో పాటు మైత్రి మూవీస్ కలిపి నిర్మించే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోని అనుకుంటున్నారు. అతన్ని హీరోగా పరిచయం చేసే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఈ సినిమాకు సుకుమార్ దగ్గర రైటర్ గా పనిచేసిన సాన బుచ్చిబాబు దర్శకుడిగా అవతారం ఎత్తనున్నారు. వైష్ణవ తేజ్ ని రామ్ చరణ్ ఎలాగైనా ఒకే చేస్తారని ఉద్దేశంతో ఈ సినిమాకోసం అచ్చ తెలుగు అమ్మాయి కావాలని కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చేసారు. మెగా హీరో పక్కన నటించే ఆ అదృష్టవంతురాలు ఎవరో.. త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus