మహేష్, విజయేంద్ర ప్రసాద్ వ్యూహంలో సుకుమార్

  • July 27, 2018 / 01:01 PM IST

ప్రస్తుతం మహేష్ బాబు… వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఉగాదికి థియేటర్లోకి రానుంది. దీని తర్వాత సుకుమార్, సందీప్ వంగా లతో సినిమా చేస్తానని మహేష్ మాటిచ్చారు. సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్ మాత్రం మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఈ స్క్రిప్ట్ ని మహేష్ కి వినిపిస్తే నచ్చలేదంట. అయినా సుకుమార్ తో సినిమా చేయడానికి మహేష్ ఆసక్తిగా ఉన్నారు. అందుకే బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన కథని తీసుకోమని సలహా ఇచ్చారంట. విజయేంద్ర ప్రసాద్ ఎరోస్ కు దాదాపు 10 కథలు ఇవ్వడానికి ఒక భారీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

ఈ కథలకు సంబంధించి కొంతమంది దర్శకుల పేర్లు కూడ ప్రచారంలోకి ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ ఒప్పుకుంటే ఎరోస్ సంస్థ వద్ద ఉన్న కథల్లో ఒకదాన్ని సుకుమార్ కు ఇవ్వడానికి నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉంది. మహేష్ కి సూటయ్యే కథనే ఎంపిక చేసుకునే ఛాన్స్ ని కూడా విజయేంద్ర ప్రసాద్ ఇచ్చినట్లు టాక్. అయితే సుకుమార్ వేరొకరి కథని తీసుకొని సినిమా చేస్తారా? అనేది ప్రశ్నర్ధకంగా మారింది. ఎందుకంటే అతను మొదటి నుంచి సొంతకథలనే తెరకెక్కించారు. అలాగే వేరే వారి కథ తనకు సౌకర్యవంతంగా అనిపించిందని అనేకసార్లు చెప్పారు. మరి ఇప్పుడు మహేష్ కోసం కొత్త కథ రాస్తారా? విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథతో సినిమా చేస్తారా? .. లేకా హీరోనే మార్చేస్తారా? అనేది త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus