‘అల్లు అర్జున్ 19’ నుండీ మొదటి అప్డేట్..?

  • June 7, 2019 / 03:03 PM IST

2008 లో వచ్చిన ‘కాళిదాస్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగేశ్వర రావు మనవడు సుశాంత్. తొలి చిత్రంతో కమర్షియల్ హిట్ సాధించినా నటనతో మాత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు. అడపా దడపా సినిమాలు తీసి కొన్ని ఏవరేజ్ ఫలితాల్ని కూడా అందుకున్నాడు అయినప్పటికీ నటనతో మెప్పించలేకపోయాడు. కానీ గతేడాది వచ్చిన ‘చిలాసౌ’ చిత్రంతో మాత్రం ఆకట్టుకున్నాడు. అంటే దాదాపు పదేళ్ళు పట్టింది సుశాంత్ ప్రేక్షకుల్ని మెప్పించడానికి..! ఇక తొందరపడకుండా తనకు సెట్టయ్యే కథల కోసం ఎదురుచూస్తున్నాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకేక్కబోతున్న సంగతి తెలిసిందే. ‘గీతా ఆర్ట్స్’ ‘హారికా హాసిని క్రియేషన్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్ కూడా నటించబోతున్నాడు. స్వయంగా ఈ విషయం పై సుశాంత్ క్లారిటీ ఇవ్వడం విశేషం. కథలో చాలా కీలక పాత్రని పోషిస్తున్నాడట సుశాంత్. తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని సుశాంత్ చెప్పుకొచ్చాడు. సుశాంత్ మాట్లాడుతూ.. “నా తరువాతి సినిమా అప్‌డేట్స్‌ కోసం ఇంతకాలం ఎదురుచూసిన అభిమానులకు ధన్యవాదాలు. నేను అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తున్నాను. ఈరోజే షూటింగ్‌ సెట్‌లో అడుగుపెట్టాను.. నాకెంతో ఇష్టమైన త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతానికి ఈ మూవీ గురించి ఇంతకంటే ఏం చెప్పలేను. హారిక అండ్‌ హాసిని, గీతా ఆర్ట్స్‌ సంస్థలో నటించడం ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus