Brahmamudi August 3rd: స్వప్నకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కావ్య!

  • August 3, 2023 / 02:49 PM IST

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…కళ్యాణ్ కోసం ఓ అభిమాని లెటర్ రాసి ఉంటుంది అయితే ఆ లెటర్ తీసుకొని కావ్య తనని ఆట పట్టిస్తూ ఇల్లు మొత్తం పరుగులు పెట్టిస్తుంది. కాకపోతే ఆ లెటర్ తానే చదువుతానని కావ్య చెప్పడంతో వద్దు వదిన అంటూ కళ్యాణ్ చెబుతారు. ఇంటి సభ్యుల ఓటింగ్ ప్రకారం కావ్య ఈ లెటర్ ఓపెన్ చేసి చదవబోతూ ఉండగా కళ్యాణ్ లెటర్ లాక్కొని తన గదిలోకి వెళ్తారు.

ఇక తనకు ఎవరు లెటర్ రాశారు ఏంటి అని ఆత్రుతగా ఆ లెటర్ ఓపెన్ చేసి చూడటంతో ఎన్ని రోజులకు కనిపించావు అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. ఇలా రాసి ఉండటంతో ఇది ఎవరు రాసి ఉంటారన్న ఆలోచనలో కళ్యాణ్ ఉంటారు. మరోవైపు స్వప్న పీరియడ్ పెయిన్ తో చాలా బాధపడుతూ ఉంటుంది. అందుకోసం టాబ్లెట్స్ ఎవరినైనా అడిగి తెప్పించుకుందాము అనుకుంటే తన అబద్ధపు ప్రెగ్నెన్సీ బయటపడుతుందని ఆన్లైన్ ఆర్డర్ చేస్తుంది.ఇక తనకు ఆర్డర్ రావడంతో చాలా కంగారుగా దొంగచాటుగా వెళ్లి మెడిసిన్స్ తెచ్చుకుంటుంది అయితే ఇదంతా రుద్రాన్ని గమనిస్తూ ఉంటుంది.

స్వప్న కంగారుగా గదిలోకి వెళ్లి టాబ్లెట్స్ వేసుకుంటుంది అది గమనించిన రుద్రాణి ఏం చేస్తుంది అసలు ఇది ఏదో తప్పు చేసిన దానిలా అలా కంగారు పడుతుంది అనుకొని స్వప్న గదికి వెళ్లి ఆ టాబ్లెట్స్ చూస్తుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే దీనికి కడుపు లేదా ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడుతుంది అంటూ షాక్ అవుతుంది. ఆ టాబ్లెట్స్ తీసుకుని తన కొడుకు వద్దకు వెళ్లి ఈ టాబ్లెట్స్ పీరియడ్స్ నొప్పితో బాధపడే వాళ్ళు వేసుకుంటారు మరి ఆ స్వప్న వేసుకుంటుంది అంటే అర్థం దానికి కడుపు లేదనే కదా అంటూ చెప్పడంతో రాహుల్ షాక్ అవుతాడు.

స్వప్న తిరిగి తన గదికి వచ్చేలోపు ఆ టాబ్లెట్స్ బాటిల్ తన అత్తగారి చేతిలో ఉండటం చూసి షాక్ అవుతుంది.రాహుల్ నీకు నిజంగానే కడుపు లేదా పెళ్లి చేసుకోవడం కోసమే ఇలా అబద్దం చెప్పావా అంటూ తనని నిలదీస్తూ ఉంటారు. అంతలోపు కావ్య తన గది నుంచి బయటకు వస్తుంది.దాంతో స్వప్న తన అత్తగారి చేతిలో ఉన్నటువంటి బాటిల్ లాక్కొని కావ్య చేతిలో పెట్టి ఇదిగో నొప్పికి టాబ్లెట్స్ అడిగావు కదా తీసుకో అంటూ ఆ నేరం మొత్తం తన చెల్లిపై వేసి తప్పించుకుంటుంది. మరోవైపు అప్పు కనకం ఇద్దరు చీటీ వేసే ఆవిడ దగ్గరకు వెళ్లి తాను కూడా చీటీ వేస్తానని మొదటి చీటీ తానే తీసుకుంటానని చెబుతుంది.

తినడానికి తిండి కూడా సరిగా లేదు అలాంటిది నెలకు 5000 రూపాయల చీటీ ఎలా వేస్తావు అని మాట్లాడుతుంది. అంతలోపు తన భర్త రావడంతో ఈయన ఎవరు అని అడుగుతుంది అప్పు. మా ఆయన అని చెప్పడంతో మొన్న థియేటర్ దగ్గర వేరే అతనితో కనిపించావు ఆయన నీకు మల్లెపూలు కూడా కొనిచ్చారు కదా అంటూ చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ గొడవపడతారు. దాంతో కనకం కంగారు పడి అప్పుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది.. మరోవైపు కావ్య రాజ్ కినేను డబ్బు మా అమ్మ వాళ్లకు ఇవ్వడానికి వెళ్తాను అని మెసేజ్ చేస్తుంది. దాంతో రాజ్ నీ డబ్బు నీ ఇష్టం నాకు చెప్పాల్సిన పని లేదని చెప్పాను కదా అని చెప్పడంతో కావ్య సంతోషపడుతుంది.

ఇక తర్వాతి ఎపిసోడ్లో (Brahmamudi) కావ్య స్వప్న వద్దకు వెళ్లి తనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఈరోజు నిజం బయటపడటంతో ఆ నేరాన్ని నాపై తోసావు నీ అంతట నువ్వే నీకు కడుపు లేదని ఇంట్లో వాళ్లకి చెబితే బాగుంటుంది లేదంటే నేనే అందరికీ చెప్పేస్తాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తిరిగి వచ్చేలోపు నువ్వు ఈ నిజం అందరికీ చెప్పాలి. అంటూ తన అక్కకు వార్నింగ్ ఇస్తుంది.తన పుట్టింటికి వెళ్తుండగా అపర్ణ ఆపి నువ్వు మీ పుట్టింటికి డబ్బులు మోస్తున్నావుగా అంటూ తనని అడుగుతుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus