డ్రస్ విషయంలో గొడవపడ్డ తమన్నా

  • June 11, 2018 / 12:49 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా జయేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ కి జోడీగా “నా నువ్వే” చిత్రాన్ని చేసింది. ఇది త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ లో కంగనా రనౌత్ చేసిన క్వీన్ తెలుగు వెర్షన్ లో క్వీన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ సినిమాకు మొదటి నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ చిత్రాన్ని దక్షిణాది అన్ని భాషల్లో రీమేక్ చేయాలని దర్శకనిర్మాత అయిన త్యాగరాజన్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఒక్కో భాషలో ఒక్కో హీరోయిన్ ని ఎంపిక చేయాలన్న అన్వేషణలో బాగా ఆలస్యమయింది. ఇక తెలుగులో తమన్నా ని ఫిక్స్ చేసి నీలకంఠ దర్శకత్వంలో ‘క్వీన్’ ఆరంభమయింది. అయితే దర్శకునికి, తమన్నాకి గొడవలు రావడంతో మరింత ఆలస్యం అయింది.

త్యాగరాజన్ కూడా తెలుగు హక్కులను తర్వాత మను కుమరన్ అనే వ్యక్తికి ఇచ్చేశారు. నీలకంఠ స్థానంలో ప్రశాంత్ వర్మ దర్శకుడయ్యారు. ఈ చిత్రానికి ‘దటీజ్ మహాలక్ష్మి’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. ఇకనుంచి అయినా సినిమా సవ్యంగా సాగుతుందంటే అదీ లేదు. రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్‌లో ఓ డ్రెస్ విషయంలో హీరోయిన్ తమన్నాకు, ఆ చిత్ర క్యాస్టూమ్ డిజైనర్‌కు మధ్య చిన్న గొడవ వచ్చింది. ఓ సన్నివేశంలో తమన్నా యూరోపియన్ దుస్తుల్లో కనిపించాలి. ఆ డ్రస్ వేసుకోనని తమన్నా మొండికేసింది. డిజైనర్ ఎంత చెప్పినా ఒప్పుకోకపోవడంతో షూటింగ్ వాయిదా పడింది. తన ప్రవర్తనపై మీడియాలో నెగిటివ్ ప్రచారం రావడంతో సినిమాని కంప్లీట్ చేయాలనీ తమన్నా ఫిక్స్ అయింది. జూన్ రెండో వారం నుంచి నాన్ స్టాప్ గా డేట్స్ కేటాయించింది. మరి అప్పుడైనా షూటింగ్ సవ్యంగా జరుగుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus